క్రీడలుటీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మన్ దూరం!

టీమిండియాకు మరో స్టార్ బ్యాట్స్ మన్ దూరం!

స్టార్ బ్యాటర్ ఇంగ్లండ్ సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌‌లో భారత్ జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల రాకణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జాడేజ జట్టుకు దూరం అయ్యారు. కాగా తాజాగా విడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యార్ గాయం తిరగబెట్టొంది. వెన్ను నోపి కారణంగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు అయ్యార్ దూరం కానున్నాడు. తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్న శ్రేయాస్.. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌‌‌పీఏలో చేరినట్లు సమాచారం.రెండో టెస్టు ముగిశాక అందరి క్రికెట్ సామగ్రి విశాఖ నుంచి రాజ్ కోట్ కు తరలించగా, శ్రేయాస్ అయ్యర్ కిట్ ను మాత్రం అతడి స్వస్థలం ముంబయికి తరలించారు. గాయం తీవ్రత దృష్ట్యా శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మూడు టెస్టులకు అందుబాటులో ఉండబోవడంలేదని ఈ పరిణామం ద్వారా అర్థమవుతోంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article