తాజా వార్తలుబెంగళూరులో బాంబు పేలుడు… హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

బెంగళూరులో బాంబు పేలుడు… హైదరాబాద్‌లో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

బెంగళూరు:కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రసిద్ధ ‘రామేశ్వరం కేఫ్‌’లో బాంబు పేలుడు నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు. బెంగళూరు కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌ వద్ద శుక్రవారం మధ్యాహ్నం పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ధాటికి తొమ్మిది మంది గాయపడ్డారు. గుర్తు తెలియ‌ని వ్యక్తి కేఫ్‌లో ఉంచి వెళ్లిన బ్యాగు కారణంగా పేలుడు సంభవించినట్లు నిర్ధారించారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article