తాజా వార్తలుమధ్యాహ్న భోజనంలో మార్పులు..చేసిన ఏపీ సర్కార్

మధ్యాహ్న భోజనంలో మార్పులు..చేసిన ఏపీ సర్కార్

నిత్యావసరాల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజనం (డొక్కా సీతమ్మ బడి భోజనం)లో నాణ్యత తగ్గినట్లు ఫిర్యాదులు రావడం తోప్రభుత్వం అప్రమత్తమైంది. క్వాలిటీ పెంచుతూ మెనూలో దీపావళి నుంచి మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెగ్యులర్ ఫుడ్తో పాటు వారంలో 5 రోజులు ఇస్తున్న గుడ్డును 3 రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వనున్నారు. రాగి జావతోపాటు వారంలో కొన్ని రోజులు కేక్, డ్రైఫ్రూట్స్ లడ్డూను అందిస్తారు. ఓ రోజు అరటి పండు కూడా మెనూలో చేర్చబోతున్నారు.
డొక్కా సీతమ్మ బడి భోజనం మెనూ ఇలా…
సోమవారం: ఉడికించిన గుడ్డు లేదా వెజిటేబుల్‌ పలావు, కోడి గుడ్డు కూర, వేరుశనగ చిక్కీ
మంగళవారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
బుధవారం: వెజిటేబుల్‌ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, వేరు శనగ చిక్కీ
గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌ బాత్‌ / నిమ్మకాయ పులిహోర (టెమన్‌ రైస్‌), -టొ-మాటో పచ్చడి, ఉడికించిన కోడి గుడ్డు
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడి గుడ్డు, వేరుశనగ చిక్కీ
శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు. స్వీట్‌
పొంగల్‌

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article