తాజా వార్తలుమానసిక సమస్యల రిస్క్ పెంచుతున్న ఎనర్జీ డ్రింక్ లు

మానసిక సమస్యల రిస్క్ పెంచుతున్న ఎనర్జీ డ్రింక్ లు

పిల్లల్లో మానసిక సమస్యలకు ఎనర్జీ డ్రింక్ లు కారణమవుతున్నాయని .. మానసిక కుంగుబాటు, ఒత్తిడి, నిద్రకు సంబంధించిన సమస్యలు, చదువులో వెనకబడడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెసర్ అమెలియా హెచ్చరించారు. ఈ డ్రింక్ ల వినియోగంతో దీర్ఘకాలంలో మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్ ల అమ్మకానికి వ్యతిరేకంగా పలు స్వచ్చంద సంస్థలతో కలిసి ప్రొఫెసర్ అమెలియా పోరాడుతున్నారు. డ్రింక్ ల అమ్మకాలపై ఆంక్షలు విధించాలని బ్రిటన్ లో పలు ఆందోళనలు కూడా జరిగాయి. దీంతో ప్రభుత్వం స్పందించి పదహారేళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు అమ్మొద్దంటూ చట్టం తీసుకొచ్చింది.
ఎదుగుతున్న వయసులో శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయంటూ ఎనర్జీ డ్రింక్ ల తయారీదారులు చెబుతుంటారు.. చిన్నపిల్లలు, యువత కోసమని ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తున్నారు. ఈ డ్రింక్ లతో పిల్లల పెర్ఫార్మెన్స్ పెరుగుతుందని ప్రకటనలతో ఊదరగొడుతుంటారు. ఈ ప్రకటనల ప్రభావంతోనో, పిల్లల ఆరోగ్యం కోసమనో తల్లిదండ్రులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ డ్రింక్ ల వల్ల ప్రయోజనంలేదని తమ అధ్యయనంలో తేలిందని ప్రొఫెసర్ అమెలియా అన్నారు.
ఇంగ్లాండ్ లోని టీసైడ్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ట్రాన్స్ లేషనల్ రీసెర్చ్ తోపాటు న్యూకాజిల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల యువతపై ఎనర్జీ డ్రింక్ ల ప్రభావంపై అధ్యయనం నిర్వహించారు. ఇందుకోసం 21 దేశాలకు చెందిన 12 లక్షల మందిపై జరిపిన పలు పరిశోధనలను నిశితంగా పరిశీలించారు. ఎదిగే పిల్లలకు ఎనర్జీ డ్రింక్ లు తాగించడం వల్ల ఉపయోగం లేకపోగా కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతోందని ఈ పరిశోధనలో తేలింది. ఎనర్జీ డ్రింకుల పేరుతో అమ్ముతున్న హై కెఫైన్ డ్రింక్ లతో యువత పలు మానసిక సమస్యలు ఎదుర్కొంటోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article