తాజా వార్తలుతిరుపతి వెళ్తున్న బస్సును ఢీకొన్న లారీ.. 9మంది మృతి

తిరుపతి వెళ్తున్న బస్సును ఢీకొన్న లారీ.. 9మంది మృతి

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున పెను ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ బస్సు ప్రయాణికులతో బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article