హిందూపురంటౌన్ :హిందూపురం పట్టణంలోని ఎంజిఎం పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న నల్లూరు రామకృష్ణ పదవీ విరమణ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులుగా రామకృష్ణ దాదాపు 23 సంవత్సరాలు విద్యార్థులకు ఎంతో సేవ చేశారని వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేంద్ర కుమార్, విజయ్ కుమార్, సిద్దగిరి శ్రీనివాసులు, లోక్ నాథ్, నాగప్ప శనివారంరెడ్డి నరసింహులు ,ఏపీటీఎఫ్ శివన్న, నారాయణస్వామి, హనుమంతు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

