Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలువైకాపాలోకి వలసలు

వైకాపాలోకి వలసలు

కదిరి:తనకల్లు మండల పరిధిలోని తవళం గ్రామపంచాయతీ గందోడువారిపల్లికి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 20 మంది యువకులు ఎం.జి రెడ్డి సూచనలతో ముబారక్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్, రాష్ట్ర సీఈసీ సభ్యుల పూల శ్రీనివాసరెడ్డిలు కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారిని కేవలం కార్యకర్తల్లాగా కాకుండా కుటుంబ సభ్యులుగా భావించే సౌమ్యుడు, మంచి మనసున్న బి.ఎస్ మార్బుల్ సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరిన యువకులకు స్వాగతం చెబుతున్నామని, పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తలను గుర్తిస్తామన్నారు. సీఎం జగనన్నను రెండవసారి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఎం.జి రెడ్డికి అభినందనలు తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి యువకుడు వారి మండలంలో అత్యధిక మెజార్టీ సాధించేందుకు ప్రధాన పాత్ర పోషించాలని కోరారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో భాగమైన ప్రతి ఒక్కరూ ఆ పార్టీ కుటుంబ సభ్యులుగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article