Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుఅటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

వి.ఆర్.పురం :మండలంలోని రామవరం గ్రామపంచాయతీ పరిధిలోని కారం గుంపు ప్రాంతం చివర, సుమారు రెండు కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని ఒక వ్యక్తి మృత దేహం లభ్యమయిందనీ, ఏఎస్ఐ ఏ రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామవరం పంచాయతీ పరిధి నందు ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నదని స్థానిక విఆర్ఓ సమాచారం ఇవ్వడంతో, కూనవరం ఎస్సై వెంకట్, విఆర్ పురం పోలీసు సిబ్బంది మృతదేహం వద్దకు చేరుకొని వెళ్లి చూడగా, అక్కడ చింత చెట్టు క్రింద వెళ్లకిలపడి ఉన్న మగ శవం కుళ్లిపోయి, పురుగులు పట్టి ఉన్నదని అన్నారు. ఈమేరకు సంఘటన స్థలంలో శవ పంచనామా నిర్వహించి, అక్కడే వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించామని అన్నారు. గుర్తు తెలియని ఈ మృతదేహం విషయంపై గ్రామంలో విచారించగా ఆ వ్యక్తి ముసలివాడు మరియు వికలాంగుడని, దాదాపు ఒక నెల రోజుల నుంచి రామవరం చుట్టుపక్కల గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జివిస్తున్నాడని స్థానికులు తెలిపారని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article