తాజా వార్తలుఅమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి కోడికత్తి శ్రీను పోటీ!!

అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి కోడికత్తి శ్రీను పోటీ!!

వైకాపా అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను జై భీమ్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ సమక్షంలో కోడికత్తి శ్రీను పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కోడికత్తి శ్రీనుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాగా, త్వరలోనే జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కోడికత్తి శ్రీనివాస్‌ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ దింపాలని జైభీమ్ పార్టీ భావిస్తుంది. అయితే, దీనిపై ఆ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ స్పష్టత ఇవ్వాల్సివుంది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article