ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
కడప సిటీ :రాష్ట్ర రాజదానినీ అమరావతి నుండి విశాఖకు తరలించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంవైకాపాకీమరణశాసనం.ఇది ఒక చారిత్రిక తప్పిదం
ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదు,
రాజదానినీ విశాఖకు తరలిస్తే, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతి మయం, మాఫియా మయం అవుతుంది. కాబట్టి తరలించ వద్దు. దీనికి బదులు ఉత్తరాంధ్ర సృజల స్రవంతినీ పూర్తి చేయండి! విశాఖ మెట్రో, రైల్వేజోన్ తెప్పించండి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయవద్దని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు.
రాజదాని తరలింపు జోలికి పోకుండా, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయండి అని గోదావరి జిల్లా ప్రజలు అడుగుతున్నారు.ఉన్న రాజదానినీ తరలించడం ఎందుకు? అని క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.రాజధానిని మరింత దూరభారం చేస్తారని నెల్లూరు, రాయలసీమ ప్రజలు ప్రశ్నిస్తున్నారు?
ఒక రాజాధానికి దిక్కూలేదు.. మూడు రాజధానులటా!జగన్ మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ అని ఆయన వ్యాఖ్యానించారు.