తుని:తుని మండలం టీ తిమ్మాపురం గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి ట్రైన్ లో నుంచి కింద పడిపోవడం జరిగింది ఈ ప్రమాదంలో అతని తలకి బలమైన గాయాలు అయ్యాయి ఒక కాలు పూర్తిగా విరిగిపోయింది ఆయన్ని పాయకరావుపేట 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి శ్రీనివాస్ పైలట్ నాగార్జున ఘటన స్థలానికి చేరుకొని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.