Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుభవిష్యత్తు రోజులు టిడిపివే : నియోజకవర్గ కన్వీనర్ బోరగం

భవిష్యత్తు రోజులు టిడిపివే : నియోజకవర్గ కన్వీనర్ బోరగం

జీలుగుమిల్లి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపడుతుందని పోలవరం టిడిపి ఇన్చార్జి బోరగం శ్రీనివాసరావు అన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పారు. ప్రతి కార్యకర్త 40 రోజులు కంటికిరెప్పలా పార్టీని కాపాడవలసిన బాధ్యత కూడా మన అందరిపై ఉందని అన్నారు. మనం కడు జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేయవలసిన అవసరం కూడా మన అందరి పైన ఉందని ఆయన అన్నారు.
జీలుగుమిల్లి మండలం గంగన్నగుడెం గ్రామానికి చెందిన సొయం. ఎర్రబాబు, బుల్లిబాబు గార్ల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు వారివెంట ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, మరీదు పండు, చాపా రవి, ఊడా వెంకటేశ్వరరావు, ఆకిరెడ్డి ప్రభాకర్, కొప్పుల నాగు, మిడతా నాగు, సయ్యద్ బాబ్జీ, పైడిమాల కృష్ణ, పితాని నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, నల్లపు దుర్గారావు, వీరమల్ల పాపారావు, కారం సురేష్, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article