Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుపార్థివలింగ రుద్రాభిషేకం కు పూజ్య శ్రీశ్రీశ్రీ మాత శివానంద సరస్వతికి ఆహ్వానం

పార్థివలింగ రుద్రాభిషేకం కు పూజ్య శ్రీశ్రీశ్రీ మాత శివానంద సరస్వతికి ఆహ్వానం

జగ్గంపేట

జగ్గంపేట మండలం ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి పార్థివ లింగ రుద్రాభిషేకం (మట్టి శివలింగాలు) కు పూజ్య శ్రీశ్రీశ్రీ మాత శివానంద సరస్వతి వారికి శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి కృష్ణానగర్ ఆశ్రమంలో కలిసి ఆహ్వాన పత్రం అందించి ఆహ్వానించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ మా స్వగ్రామం ఇర్రిపాకలో నిర్వహించే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు భారతదేశంలో ఎక్కడ నిర్వహించనునటువంటి కోటి పార్థివలింగాలతో కోటి పార్థివలింగ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి పూజ్య శ్రీ శ్రీ శ్రీ మాత శివానంద సరస్వతి వారికి ఆహ్వాన పత్రం అందించి 11 రోజుల్లో ఏదో ఒక రోజు రావాలని కోరడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మాతాజీ స్పందిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమంలో పాల్గొంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థా బునం రిటైర్డ్ పి ఆర్ ఓ తులా రాముడు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article