పీసీపల్లి
పి ఎం జి ఈ పి పథకం లోన్లపై లబ్ధిదారులకు పి సి పల్లి వెలుగు కార్యాలయంలో ఏపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ వాసుదేవరావు, పీసీ పల్లి ఏపిఎం గడ్డం సత్యానందం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కొరకు ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పీ ఎం జి ఈ పి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే బ్యాంకుతో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారులని ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతం కావడంతో ఏ మండలంలో అధిక సంఖ్యలో గేదెలు, గొర్రెలు మేకలకు అప్లై చేసుకోవడం జరిగిందని లబ్ధిదారులు ఈటిపై ఆర్థిక స్థితిని పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది,వెలుగు సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.