Sunday, February 15, 2026

Creating liberating content

Uncategorizedక్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలతో మానసిక ఉల్లాసం

పులివెందుల టౌన్
విద్యార్థిని విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రమ్మ అన్నారు. మంగళవారం
ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా ఆరవరోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. వై . నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో వైయస్ వి ఆర్ ఎం కళాశాల కాలేజ్ విద్యార్థినిలు , ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దత్తత గ్రామమైన బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని ,విద్యార్థులకు ఆరోగ్యకర మైన సలహాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటసుబ్బయ్య, ఎస్ టి ఐ కౌన్సిలర్ బాదల్ వల్లి, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు అలాగే పాఠశాల పరిసరాలు పరిశుభ్రం, వ్యక్తిగత పరిశుభ్రంతో అనారోగ్యం దరిచేరదన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article