Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

ఏపీలో డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈనెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా పథకం నిధుల్ని ఏపీ సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 2019 ఏప్రిల్ 11 తేదీ నాటికి రాష్ట్రంలో 78,94,169 మంది పొదుపు మహిళల పేరిట బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్లు అప్పు ఉండగా.. అందులో ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,175.97 కోట్లు ప్రభుత్వం ఆయా మహిళలకు చెల్లించింది. మిగిలిన రూ.6,394.83 కోట్ల మొత్తాన్ని 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేస్తారు. ఆఖరి నాలుగో విడతగా మంగళవారం నుంచి నేరుగా వారికే చెల్లించబోతోంది.వైఎస్సార్‌ ఆసరా పథకంలో నాలుగు విడతల్లో నేరుగా అందజేయడంతో పాటుగా ఆ డబ్బులను మహిళలు దేనికైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article