తాజా వార్తలుఇండోర్ నగరంలో జనవరి 1, 2025 నుండి యాచించడంపై పూర్తి నిషేధం

ఇండోర్ నగరంలో జనవరి 1, 2025 నుండి యాచించడంపై పూర్తి నిషేధం

యాచిస్తే ఎఫ్ఐఆర్ నమోదు..

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జనవరి 1, 2025 నుండి యాచించడంపై పూర్తి నిషేధం అమలులోకి వస్తుంది. ఎవరైనా బిచ్చగాళ్లకు డబ్బు ఇస్తే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ఈ చర్య ఇండోర్‌ను బిచ్చగాళ్ల రహిత నగరంగా మార్చే లక్ష్యంతో ఉంది. డిసెంబరు నెలాఖరులోగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యంత్రాంగం భావిస్తున్నట్లు ఇండోర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ వెల్లడించారు. యాచకులకు ఆర్థిక సహాయం చేయవద్దని, బదులుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి సహాయం చేయాలని ఆయన పౌరులను కోరారు.ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో సహా 10 ప్రధాన పట్టణ కేంద్రాలలో బిచ్చగాళ్ల రహిత నగరాలను రూపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article