Sunday, February 15, 2026

Creating liberating content

హెల్త్తేనె, అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తో ప్యాక్

తేనె, అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తో ప్యాక్

తేనెతో చర్మం మెరిసిపోతుంది. తేనెను ముఖానికి పెట్టడం వల్ల చర్మం కాంతివంతంగా అవుతుంది. ముఖానికి తేనెను పెడితే దాన్ని 15 లేదా 20 నిమిషాలకు మించి ఉంచకూడదు. ముఖానికి తేనె రాసుకోవడానికి ముందు ముఖాన్ని బాగా శుభ్రం చేయండి. తర్వాత కాటన్ తీసుకుని తేనెలో ముంచండి. ఇప్పుడు దీంతో ముఖానికి తేనెను పెట్టండి.


తేనెను నేరుగా ముఖానికి వాడకూడదు. ఎందుకంటే దీనివల్ల ముఖం జిగటగా మారుతుంది. అందుకే తేనెలో కొద్దిగా అలోవెరా జెల్ లేదా రోజ్ వాటర్ మిక్స్‌ను ముఖానికి అప్లై చేయండి. తేనెను ముఖానికి పెట్టిన తర్వాత చేతులతో ముఖాన్ని కాసేపు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article