Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలువైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన

వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన

విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మికులు, నిర్వాసితులు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో మంగళవారం ఆందోళన చోటుచేసుకుంది. కూర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించి, స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) లో విలీనం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.ఈ ఆందోళనతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి, వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, కార్మిక నాయకులు మరియు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article