ప్రధాని నరేంద్ర మోదీ నేడు మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన ఈ సందేశాన్ని అందజేశారు. మోదీ ఈ సందర్భంగా, భారత అంతరిక్ష రంగం విజయాలను గర్వంగా గుర్తుచేసుకున్నారు మరియు భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న అద్భుత కృషిని కొనియాడారు.అంతరిక్ష రంగానికి సంబంధించి భారత ప్రభుత్వం ఎన్నో భవిష్యత్ నిర్ణయాలు తీసుకున్నట్టు, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్టు ప్రధాని వివరించారు.గతేడాది చంద్రయాన్-3 మిషన్ విజయం సాధించిన నేపథ్యంలో, నేషనల్ స్పేస్ డే (జాతీయ అంతరిక్ష దినోత్సవం)ను ప్రారంభించటం జరగడం విశేషం. ఈ మిషన్ విజయంతో భారతదేశం అంతరిక్ష రంగంలో మరో మైలురాయిని చేరుకుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, భారత అంతరిక్ష రంగం మరింత ముందడుగు వేయాలని, కొత్త కొత్త విజయం దిశగా కృషి చేయాలని మోదీ తన సందేశంలో సూచించారు.

