క్రీడలుఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

ఐపీఎల్ 2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎంఎస్‌ ధోనీ!

ఐపీఎల్ 2025 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా లేదా అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రస్తుతం, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్‌క్యాప్డ్ ప్లేయర్ అంటే సాధారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని క్రికెటర్‌ను అలా పిలుస్తారు, కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఇంటర్నేషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు పూర్తి చేసిన ఆటగాళ్లను కూడా అలా పరిగణిస్తారు.సీఎస్‌కే, బీసీసీఐకు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణించాలన్న ఆలోచనను అందించినట్లు సమాచారం. ఇది బోర్డు సానుకూలంగా చూడడం వల్ల, రాబోయే సీజన్‌లో ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉంటే, ఫ్రాంఛైజీకి ఆర్థికంగా పెద్ద ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ధోనీ కూడా తన భవిష్యత్తు రాబోయే వేలంలో ప్లేయర్ రిటెన్షన్ నిబంధనలపై ఆధారపడి ఉంటుందని ప్రకటించాడు.ఇది ఐపీఎల్ అభిమానులకు ఆసక్తికరంగా మారిన విషయం, ధోనీ అభిమానులు అతని నిర్ణయాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article