Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుజోగి రాజీవ్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసిన ఏసీబీ

జోగి రాజీవ్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసిన ఏసీబీ

ఏ1: జోగి రాజీవ్ఏ2: జోగి వెంకటేశ్వరావు
కేసు సెక్షన్లు: 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12
ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పేర్లు:మండల సర్వేయర్ రమేశ్,గ్రామ సర్వేయర్ దేదీప్య

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఉదయం 5 గంటలకు చేరుకుని సోదాలు జరిపింది. ఈ సోదాల్లో పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం, జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌నపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చారు, జోగి వెంకటేశ్వరావు పేరును ఏ2గా చేర్చారు.ఈ కేసులో అంబాపురం మండల సర్వేయర్ రమేశ్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్ రిజిస్ట్రార్ వి. నాగేశ్వరరావుల‌ను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, మరియు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.ఇదే వ్యవహారంలో ఆగస్టు 8న అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదుతో జయవాడ వెస్ట్ ఏసీపీ విచారించారు. విచారణ నివేదికను డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సీపీ సమర్పించారు.విజయవాడ పోలీసులు మండల, గ్రామ సర్వేయర్లు తప్పుడు సర్వే చేశారని నివేదిక ఇచ్చారు. దీంతో విజయవాడ పోలీసుల నివేదిక ఆధారంగా తాజా ఏసీబీ కేసు నమోదు చేసారు. సర్వే జరపకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు ఏసీబీ నిర్ధారించింది. 87 సర్వేనెంబర్ సీఐడీ అటాచ్‌లో ఉందని గుర్తించారు. నున్న సబ్ రిజిస్ట్రార్ రికార్డులను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ తెలిపింది.జప్తులో ఉన్న అంబాపురం అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి, విక్రయించినట్టు జోగి రమేశ్ కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article