Sunday, September 14, 2025

Creating liberating content

టాప్ న్యూస్చంద్ర‌బాబుకు మంచి పేరొస్తుంద‌నే టిడ్కో గృహాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం: టీజీ భ‌ర‌త్

చంద్ర‌బాబుకు మంచి పేరొస్తుంద‌నే టిడ్కో గృహాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం: టీజీ భ‌ర‌త్

సీఎం చంద్రబాబుకు పేరొస్తుందనే టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా వాటికి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రంగులు వేసిందని రాష్ట్ర పరిశ్రమ, వాణిజ్యం, ఫుడ్ కార్పొరేషన్ శాఖమంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం కర్నూలు నగర శివార్లలోని జగన్నాథ గట్టుపై కర్నూలు నగరం పాలక సంస్థ పి యం ఏ వై(అర్బన్) టీడ్కో కాలనీ నందు రూ.1.38 కోట్లతో నిర్మించనున్న మహిళా మార్ట్ నిర్మాణానికి ఆయన అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఏపీ టిడ్కో ఎస్ఈ రాజశేఖర్లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ… సీఎం చంద్రబాబుకు పేరొస్తుందనే టిడ్కో గృహాల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ఈ ఇళ్లను గత ఐదేళ్లలో అభివృద్ధి చేయకపోగా ఐదేళ్ల పాలనలో రంగులు వేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు త్వరలో అందజేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి భరత్ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article