Thursday, September 18, 2025

Creating liberating content

తాజా వార్తలుసచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మిడి సంధ్యారాణి

సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మిడి సంధ్యారాణి

సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణిని మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఆమెకు మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల శాఖలు అప్పగించారు. ఈ నేపథ్యంలో, గుమ్మిడి సంధ్యారాణి నేడు ఏపీ సచివాలయంలోని తన చాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాల్లో డ్రాప్ అవుట్లను నివారిస్తామని చెప్పారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article