Thursday, September 18, 2025

Creating liberating content

తాజా వార్తలుసింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకున్న హోంమంత్రి అనిత

సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకున్న హోంమంత్రి అనిత

ఏపీ హోం మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత వంగలపూడి అనిత ఇవాళ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు పోలీసులు గతంలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని మండిపడ్డారు. వారిలో ఇంకా వైసీపీ రక్తం ప్రవహిస్తున్నట్టుందని వ్యంగ్యం ప్రదర్శించారు. మీకు జగన్ పై ఇంకా ప్రేమ ఉంటే… ఉద్యోగాలు వదిలేసి ఆ పార్టీ కోసం పనిచేసుకోండి అంటూ అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడ తప్పు జరిగినా బాధ్యులను వదిలేది లేదని స్పష్టం చేశారు. సింహాచలం దేవస్థానం భూములు ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కానివ్వబోనని తెలిపారు. అంతకుముందు, సింహాచలం ఆలయంలో హోంమంత్రి అనితకు ప్రోటోకాల్ అనుసరించి పూర్ణకుంభ స్వాగతం లభించింది. ఆలయ గర్భగుడిలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article