Friday, May 9, 2025

Creating liberating content

టాప్ న్యూస్ఉద్దండుల సరసన పవన్

ఉద్దండుల సరసన పవన్

బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అధినేతలు, కొత్తగా ఎన్నికైన లోక్‌సభ అభ్యర్థులతో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరిగింది. తమ పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసీనులయ్యారు. జేడీఎస్- హెచ్ డీ కుమారస్వామి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- అజిత్ పవార్, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, జేడీయూ- నితీష్ కుమార్, శివసేన- ఏక్‌నాథ్ షిండే, లోక్‌ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్)- చిరాగ్ పాశ్వాన్, హిందుస్తానీ ఆవామీ మోర్చా- జీతన్ రామ్ మాంఝీ వేదికపై కూర్చున్నారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన పవన్ కల్యాణ్.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొత్తగా లోక్‌సభకు ఎన్నికైన పలువురు ఎంపీలు ఆయనతో మాట్లాడటం, షేక్ హ్యాండ్ ఇవ్వడం కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article