Tuesday, May 6, 2025

Creating liberating content

సినిమాబాలకృష్ణ ముఖ్య అతిథిగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్!

బాలకృష్ణ ముఖ్య అతిథిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్!

విష్వక్సేన్ కథానాయకుడిగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రూపొందింది. ఈ కథ గోదావరి తీరప్రాంతంలో నడుస్తుందనే విషయం టైటిల్ ను బట్టే తెలిసిపోతోంది. నేహాశెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి, కృష్ణచైతన్య దర్శకత్వం వహించాడు. సూర్యదేవర నాగవంశీ – సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. హైదరాబాద్ – మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో రేపు ఈ వేడుకను నిర్వహించనున్నారు. బాలకృష్ణ ముఖ్య అతిథిగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. మాస్ ఆడియన్స్ లో విష్వక్ కి మంచి ఇమేజ్ ఉంది. అందుకు తగిన విధంగానే ఇసుక మాఫియా నేపథ్యంలో ఈ కథను రాసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article