Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుబస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి, 40మందికి గాయాలు

బస్సు బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి, 40మందికి గాయాలు

ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ప్రమాదం కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి ఆదోని వెళ్తుండగా అతి వేగంతో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుప్పుతప్పి.. బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 40మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన చిన్నారులను హైదరాబాద్ చెందిన లక్ష్మీ(13), గోవర్ధిని(8)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article