రూ. 8.3 కోట్లు గెలుచుకున్న పంజాబ్కు చెందిన పాయల్
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ లో భారతీయ మహిళకు జాక్పాట్ తగిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తాజాగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో భారతీయురాలు 1మిలియన్ డాలర్లు(రూ. 8.3 కోట్లు) గెలుచుకున్నారు. పంజాబ్కు చెందిన పాయలే ఈ జాక్పాట్ కొట్టారు. దీంతో ఆమె రాత్రికి రాత్రే కోటీశ్వరురాలయ్యారు. ఏప్రిల్లో పెళ్లిరోజు కానుకగా భర్త ఇచ్చిన నగదు బహుమతితో ఆమె ఆన్లైన్ ద్వారా లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అలా కొన్న లాటరీ టికెట్ పాయల్కు ఇప్పుడు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ నెల 16 తీసిన డ్రాలో ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.3337కు జాక్పాట్ తగిలింది. దీంతో రూ. 8.3 కోట్ల భారీ ప్రైజ్మనీ ఆమె సొంతమైంది.
త 12 ఏళ్లుగా ఆమె దుబాయి లాటరీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు భర్త, పిల్లల పేర్ల మీద క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పాయల్ తెలిపారు. చివరికి భర్త ఇచ్చిన క్యాష్ గిఫ్ట్తో కొన్న లాటరీ టికెట్ తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.