Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఅనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

పది రోజుల్లో ఇంట్లో జరగనున్న పెళ్లి కోసం బట్టల షాపింగ్ చేద్దామని వారంతా ఎంతో ఆనందంగా హైదరాబాద్ వెళ్లారు. కుటుంబమంతా నచ్చిన దుస్తులు కొనుక్కొని సంతోషంతో తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చి ఐదుగురిని బలిగొంది. ఏపీలోని అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌, బెంగళూరు హైవేపై గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద కారు, లారీ ఢీకొట్ట ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.ఘటనస్థలిలోనే ముగ్గురు దుర్మరణం పాలవగా గుత్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు. మృతులను అనంతపురంలోని రాణినగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.అనంతపురంలోని రాణినగర్ లో నివసించే షేక్ సురోజ్ బాషా వివాహం ఈ నెల 27న జరగనుంది. ఈ నేపథ్యంలో ఏడుగురు కుటుంబ సభ్యులు కారులో పెళ్లి బట్టల షాపింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు. తిరిగి వస్తుండగా గుత్తి మండలం బాచుపల్లి గ్రామం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది.స్థానికుల సమచారంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను గుత్తి ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతులను అల్లీ సాహెబ్ (58), షేక్. సురోజ్ బాషా (28), మహ్మద్ అయాన్ (6), అమాన్ (4), రెహనాబేగం (40)గా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article