Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుచంద్రబాబు వస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి

చంద్రబాబు వస్తే అన్ని పథకాలు ఆగిపోతాయి

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటి లేదు
ప్యాకేజి స్టార్ కు పెళ్లిళ్లే కాదు… నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి
ప్యాకేజి స్టార్ కు రాష్ట్రం అంటే చులకన
జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోతాడు
కాకినాడలో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్

కాకినాడ:చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని ప్రజలను హెచ్చరించారు సీఎం జగన్. కాకినాడ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయని.. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్‌ నగరా మోగిందని గుర్తు చేశారు. మరోవంక ప్రజలంతా కూడా, పేదలంతా మరోసారి జైత్రయాత్రకు సిద్ధం సిద్ధం అంటూ గర్జిస్తూ సింహ గర్జన చేస్తున్నారన్నారు. ఇంటింట ఆత్మగౌరవాన్ని, పేద వర్గాల ఆత్మగౌరవాన్ని, అక్క చెల్లెమ్మల గౌరవాన్ని కాపాడుతున్న మన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒకటి లేదన్నారు. 2014లో ఇదే ముగ్గురు కలిసి కొన్ని ముఖ్యమైన హామీలు ఇచ్చారు..అవి చేశారా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. ఆడబిడ్డ పుడితే 25 వేలు అకౌంట్‌లో వేస్తామన్నారు వేశారా? రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా? అని ధ్వజమెత్తారు. కొత్తగా సూపర్ సిక్స్ అంటున్నారు. నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నే తాము గెలిస్తే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. టీడీపీకి ఓటు వేస్తే పథకలు రద్దు చేస్తారని చెప్పారు. మళ్లీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు. మీరు వేసె ఓటే ఐదేళ్ల భవిష్యత్తు అని సీఎం జగన్ తెలిపారు. జన్మభూమి ‍కమిటీలతో మొదలు చంద్రబాబు దాకా, పెత్తందార్ల దోపిడీ వర్గానికి మన పేదల అనుకూల వర్గానికి ఒక క్లాస్‌వార్‌ జరుగుతోందన్నారు. ఈ జరుగుతున్న యుద్ధంలో పేదల భవిష్యత్‌ కొరకు.. వ్యతిరేక కూటమితో యుద్ధం జరుగుతుందని.. ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు.. రాబోయే 60 నెలల పాటు ఎలాంటి పరిపాలన ఉండాలని నిర్ణయించే ఎన్నికలన్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో మీకు ఈరోజు జగన్‌ ద్వారా అందుతున్న పథకాలు కొనసాగలా.. వద్దా అన్నది మీ ఓటు ద్వారా నిర్ణయం అవుతుందన్నారు. జగన్‌కు ఓటేస్తే.. ఫ్యాన్‌పై రెండు ఓట్లు వేస్తే.. పథకాలన్నీ కొనసాగతాయి లేదంటే బాబు మార్క్‌తో. మోసాలతో పథకాలన్నీ ముగిసిపోతాయన్నారు. ఇది బాబు చెబుతున్న చరిత్ర.. బాబు చూసిన ఏ ఒక్కరికైనా అర్థమయ్యే చరిత్ర అన్నారు. మ్యానిఫెస్టోతో మోసం చేయడానికి బాబు మళ్లీ సిద్ధం అయ్యాడని.. జగన్‌కు ఓటేస్తే.. పట్టణాల్లోనూ, వార్డుల్లోనూ జగన్‌ మార్క్‌ సచివాలయ సేవలన్నీ కొనసాగుతాయన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. ఇంటి వద్దే మూడు వేల రూపాయల పెన్షన్‌ అందుతుంది. అదే సమయంలో పెన్షన్‌ అందిస్తున్న జగన్‌ మార్క్‌ పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుందన్నారు. ఏకంగా రెండు లక్షల డబ్బై కోట్ల రూపాయలను నేరుగా నా అక్క చెల్లెమ్మ ఖాతాల్లోకి జమ చేశామని.. ఎక్కడ వివక్ష లేకుండా, లంచాలు లేకుండా పాలన కొనసాగిందన్నారు. లేదంటే ఇప్పుడు జరుగుతున్న దానికి బాబు మార్క్‌ ముగింపు ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరుగుతుందని పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఒక చంద్రముఖి నిద్ర లేస్తుంది.. మళ్లీ ఒక పసుపుపతి నిద్ర లేస్తాడు.. వదల బొమ్మాలి.. వదల బొమ్మాలి అంటూ మీ రక్తం తాగేందుకు మీ ఇంటికే వస్తాడని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని హోల్ సేల్ గా దోచుకునేందుకు, దోచు కు న్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే, కులాన్ని హోల్ సేల్ గా బాబుకు అమ్మేయగలనన్న భ్రమతో ప్యాకేజి స్టార్ రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ఇవాళ సీఎం జగన్ కాకినాడలో మేమంతా సిద్ధం సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… ఈ ప్యాకేజి స్టార్ కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని… జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అని వ్యాఖ్యానించారు. “ఇంతకుముందు ఈ ప్యాకేజి స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడయ్యాయి.. . ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఈ ప్రాంతం ప్రేమ ఉండదు, ఈ మ్యారేజి స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్లిళ్లే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనుకటికి ఒకడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లాడన్నది సామెత. ఆ పిల్లిని చంకలో పెట్టుకున్నది చంద్రబాబు అని, ఆ పిల్లిని పిఠాపురంలో వదిలాడని ఇప్పుడర్థమైంది. ఇదీ గాజు గ్లాసు పార్టీ పరిస్థితి. ఈ గ్లాసుతో గటగటా తాగేది బాబు… దాన్ని తోమి, తుడిచి బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజి స్టార్. ఇక ఈ కూటమిలో వదినమ్మ గురించి మాట్లాడ దామా? బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది. ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీలో చేరింది. బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడి చేసింది. 30 ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా బాబు కోవర్టుగా ఇదే పనిలో ఉంది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి సీటు ఇవ్వమంటే వారికి ఇస్తుం ది” అంటూ పురందేశ్వరిపైనా విమర్శనాస్త్రాలు సంధిం చారు. ఇక, పిఠాపురంలో ఈసారి మన గీతమ్మను నిలబెడుతున్నామని, గీతమ్మ (వంగా గీత) తనకు అమ్మ వంటిదని సీఎం జగన్ పేర్కొన్నారు. గీతమ్మ లోకల్ హీరో అని కొనియాడారు. మీకు లోకల్ హీరో కావాలా… జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయే సినిమా హీరో కావాలా? అంటూ సీఎం ప్రజలను ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article