Sunday, February 22, 2026

Creating liberating content

తాజా వార్తలురాబరీ కేసులో ముద్దాయిల అరెస్ట్…

రాబరీ కేసులో ముద్దాయిల అరెస్ట్…

రేణిగుంట :తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణిగుంట డిఎస్పి భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున , సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి,మరియు సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు…

రేణిగుంట పట్టణ పోలీస్ స్టేషన్ శనివారం నాడు విలేకరుల సమావేశంలో ముద్దాయి వివరాలు తెలిపారు…

అంజి, అజిత్,భాస్కర్ ధనుష్ ,అను నిందితులు ఈనెల 17వ తేదీన వీరి ముగ్గురు రాత్రి సమయంలో రేణిగుంట బ్రిడ్జిపై వెళ్తున్న వ్యక్తి పై దాడి చేసి గాయపరిచి నగదు సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు

సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను రేణిగుంట పట్టణ పోలీసులు వారు చాకచక్యంగా పట్టుకున్నారు వీరి వద్దనండి ఒక మోటార్ సైకిల్ , సెల్ ఫోన్ ను,స్వాధీనపరచుకున్నారు…

వీరు తిరుపతి జిల్లా అవిలాల తిరుపతి పట్టణం కి చెందిన వారిగా గుర్తించారు…

వీరిని పట్టుకున్నందుకు రేణిగుంట పట్టణ పోలీసులను. సిబ్బందిని. ఎస్పీ అభినందించారు…

వీరిని రిమాండ్ తరలించారు

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలతో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డి.ఎస్.పి భవ్య కిషోర్ గారు ప్రత్యేకంగా తెలియజేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article