Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుడిటెనేటర్లతో దాడి ..వీఆర్ఏ మృతి

డిటెనేటర్లతో దాడి ..వీఆర్ఏ మృతి

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలోని వి. కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వీఆర్ఏ (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) నరసింహ ఇంటిపై జరిగిన దాడిలో ఆయన దుర్మరణం చెందారు. డిటోనేటర్లతో దాడి జరగడంతో నరసింహ అక్కడికక్కడే మరణించారు, ఆయన సతీమణికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స కోసం కడపకు తరలించారు.ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ దర్యాప్తు ప్రారంభించారు. డిటోనేటర్లు ఇంట్లో పేలిపోయాయా లేదా వీఆర్ఏను లక్ష్యంగా చేసుకుని ఎవరో ఈ దాడిని చేపట్టారా అన్న కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు. పులివెందుల డిఎస్పి మురళి నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article