జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్
కడప సిటీ
పి.సి.సి అధ్యక్షురాలు షర్మిలఅభ్యర్థనమేరకురాష్ట్ర .డి.జి.పి.ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ తెలిపారు .భద్రతా ప్రమాణాల నిబంధనల(స్కేల్) మేరకు భద్రతా కల్పించడం జరిగిందని ఎస్.పి వివరించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం వారు ఇచ్చే సిఫారసు(సెక్యూరిటీ రివ్యూ కమిటీ) నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్.పి వివరించారు.