Wednesday, September 10, 2025

Creating liberating content

తాజా వార్తలువైసీపీ నుండి టిడిపిలోకి చేరిక

వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక

కడప సిటీ:ద్వారకా నగర్ లోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి రెడ్డి సమక్షంలో కడప నగరంకు చెందిన వైసిపి విద్యార్థి విభాగం ముఖ్య నాయకులు సి.మహేష్, సిద్ధార్థ్, వరుణ్, ఉదయ్, విశ్వతేజ, కిరణ్ తదితరులు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ లో చేరారు. టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, జిల్లా నాయకులు లోకేష్ వారికి స్వాగతం పలికే టిఎన్ఎస్ఎఫ్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ తుగ్లక్ నిర్ణయాలవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మరి ముఖ్యంగా కడప నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి వైసిపి నేతల అవినీతి అరాచకాలకు స్వస్తి చెప్పాలన్నారు. విద్యార్థి యువకులలో చైతన్యం నింపి తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article