Thursday, September 11, 2025

Creating liberating content

తాజా వార్తలుటిడిపి నాయకుడికి మాతృవియోగం.

టిడిపి నాయకుడికి మాతృవియోగం.

లేపాక్షి: మండల పరిధిలోని మానేపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకులు కుమ్మరి మంజునాథ్ కు మాతృవియోగం కలిగింది. మంజునాథ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకుడు. అతని తల్లి ఈశ్వరమ్మ శనివారం మృతి చెందింది. ఈ విషయాన్ని మండల టిడిపి కన్వీనర్ జయప్ప, స్థానిక నాయకులు పాపిరెడ్డి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక నాయకుల ద్వారా మంజునాథ్ కుటుంబానికి ఆర్థిక సహకారాన్ని ప్రకటించారు. దీంతో మండల కన్వీనర్ జయప్ప, తెలుగుదేశం నాయకులు పాపిరెడ్డి ,మారుతి ప్రసాద్, ఆవల రెడ్డి, విజయకుమార్, మాజీ ఎంపీటీసీ రామచంద్ర ,మాజీ సర్పంచ్ నారాయణప్ప, నాయకులు నరసింహమూర్తి, తదితరులు మానేపల్లి లో మంజునాథ్ గృహానికి వెళ్లి ఈశ్వరమ్మ మృతదేహానికి పూల మాలలు వేసి ,నివాళులు అర్పించారు .అనంతరం ఆర్థిక సహకారాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article