రాబోవు రోజులు మళ్లీ మనవే మున్సిపల్ ఇంచార్జ్ వైయస్ మనోహర్ రెడ్డి
పులివెందుల
కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడమే ముఖ్యమం త్రి జగన్మోహన్ రెడ్డి ద్యేయమని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని రాబోయే రోజులు మళ్లీ మనవే అని మున్సిపల్ ఇంచార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం పులివెందుల మునిసిపాలిటీ పరిధిలోని ఎర్రగుడి పల్లెలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మునిసి పల్ ఇంచార్జి వై యస్ మనోహర్ రెడ్డి, చైర్మన్ వరప్రసాద్, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి, వైస్ చైర్మన్ హాఫిజ్,మునిసిపల్ కమిషనర్ రమణా రెడ్డి, జే సి ఎస్ ఇన్చార్జులు పార్నపల్లి కిషోర్, చంద్రమౌళి వార్డు కౌన్సిలర్లు బొగ్గిటి పురు షోత్తం, డేనియల్ బాబు, ఆలమూరు విజయ కుమార్ నాయుడు లతోకలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వార్డులోని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించడ మే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేయమన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమం త్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.కులం చూడం, పార్టీ చూడం, మతం చూడమని ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అన్నారు . రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటే ప్రభుత్వ పథకాలు అన్ని అందు తాయన్నారు. 175 కు 175 స్థానాలు గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాల న్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన రాష్ట్ర ప్రజలు జగన్ వైపే చూస్తున్నారన్నా రు.ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ దాసరి చంద్రమౌళి, పద్మనాభ రెడ్డి, కోళ్ల భాస్కర్, సూరి, కృష్ణమూర్తి, కాలనీ రవి, వీరారెడ్డి,సిద్దయ్య, నగిరి గుట్ట నాగరాజు,శ్రీరాములు, పెద్ద వీరయ్య, వెంకట సుబ్బయ్య, ఈశ్వరయ్య ,గంగిరెడ్డి,సచివాలయం సిబ్బంది, అధికారులు, గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.