Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలునెల్లూరులో వెనుకబడిన విజయసాయిరెడ్డి

నెల్లూరులో వెనుకబడిన విజయసాయిరెడ్డి

నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి కౌంటింగ్ లో వెనుకబడ్డారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి 26,781 భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కింపు జరిగిన ప్రకారం… వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 1,04,550 ఓట్లు రాగా… విజయసాయికి 77,769 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజు ఉన్నారు. రాజుకు 9,645 ఓట్లు వచ్చాయి. ఏపీలో లోక్ సభ స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ ల్లో చాలామంది పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఏపీలో మొత్తం లోక్ సభ స్థానాలు 25 కాగా, గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం తెలిసిందే. ఈసారి కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన లెక్కింపు ప్రకారం… టీడీపీ 16, వైసీపీ 4, బీజేపీ 3, జనసేన 2 చోట్ల ముందంజలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article