మహిళల ఆరోగ్యంపై హైదరాబాద్ లో నిర్వహించిన ఎండో మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన మాట్లాడుతూ…. తనకు ఏది కావాలో అది నిర్ణయించుకునే హక్కు స్త్రీకి ఉందని స్పష్టం చేశారు. తొలి బిడ్డను కనేందుకు అంత సమయం తీసుకోవడం పట్ల ఉపాసన ఓ ఈవెంట్ లో స్పందించారు. ఆలస్యంగా తల్లిని కావాలనుకున్నాను… అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకున్నాను అని వివరించారు. ఎప్పుడు తల్లి కావాలన్నది తన నిర్ణయం అని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రెండో సంతానం కోసం తాను సిద్ధంగా ఉన్నానని ఉపాసన వెల్లడించారు.