Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుమంచు తనను కమ్మేస్తున్నా ధ్యానంలో నిమగ్నమైన యోగి

మంచు తనను కమ్మేస్తున్నా ధ్యానంలో నిమగ్నమైన యోగి

వైరల్ అయిన ఈ వీడియో ఏఐ సృష్టిగా కొట్టిపడేసిన నెటిజన్లు
ఫేక్ కాదని తేలిన వైనం

మంచు దట్టంగా కురుస్తూ తనను కమ్మేస్తున్నా సరే ఏమాత్రం చలించక ధ్యానం చేస్తున్న ఓ యోగి వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మంచుతో కప్పుకుపోయిన పర్వతాలపై కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. అదంతా ఏఐ సృష్టేనని కొట్టిపడేశారు. అయితే, అది ఫేక్ కాదని తాజాగా నిర్ధారణ అయింది. ఆ యోగిని హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలకు చెందిన సత్యేంద్రనాథ్‌గా గుర్తించారు. బంజర్‌కు చెందిన సత్యేంద్రనాథ్ కౌలంటక్ పీఠం ఆశ్రమంలో 22 ఏళ్లుగా యోగా అభ్యసిస్తున్నారు. ఆయన అనుచరులను ఇష్పుత్ర అని పిలుస్తారు. సత్యేంద్రనాథ్ గురువు ఇష్‌నాథ్ హిమాలయ యోగా సంప్రదాయాన్ని అనుసరించేవారు. ఆయన కౌలాంటక్ పీఠానికి అధిపతి. ఈ పీఠం యోగా, దైవిక అభ్యాసాలకు స్థానం. ఇష్పుత్ర భక్తులు ఎనిమిదికి పైగా దేశాలలో విస్తరించి యోగా, భక్తి అభ్యసాలను ప్రోత్సహిస్తూ ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article