Tuesday, September 16, 2025

Creating liberating content

తాజా వార్తలుతిరుమల కొండపై అన్న, పానీయాల్లో శుచి, శుభ్రత లేదు

తిరుమల కొండపై అన్న, పానీయాల్లో శుచి, శుభ్రత లేదు

  • టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్

తిరుమల కొండపై అన్న, పానీయాల్లో శుచి, శుభ్రత లేదని టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పేర్కొన్నారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీటీడీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మాట్లాడిన మాటలు క్లుప్తంగా మీ కోసం..

టీటీడీ భక్తుల ఆరోగ్య, ప్రాణాలను పణంగా పెడుతోంది. తిరుమల కొండలను మింగే అనకొండలు తయారయ్యాయి. జగన్ రెడ్డి అండ్ కో తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. భక్తులకు సరఫరా చేస్తున్న నీరు, ఆహారం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. కనీస ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడం లేదు. మొద్దునిద్ర పోతున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, హెల్త్ ఆఫీసర్లు, ఫుడ్ ఇన్ స్పెక్టర్లు తమ మొద్దు నిద్ర వీడాలి. కేంద్ర హోంశాఖ నియమించిన కమిటీ విషయాలను బయటపెట్టేవరకు టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియడంలేదు. లక్షలాది మంది దేశవ్యాప్తంగా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వస్తున్నారు. వీళ్లకు కనీసం నాణ్యమైన, శుభ్రమైన మంచినీరు, ఆహారం కూడా అందించలేని పరిస్థితిలో టీటీడీ ఉన్నదంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? తిరుమల కొండపైన భక్తులకు నీరు సరఫరా చేసే జలాశయాలు గోగర్భం, ఆకాశ గంగ, కుమార ధార, పసుపు ధార జలాశయాలను ఎన్నిసార్లు పరిశుభ్రం చేశారో తెలపాలి. ఈ నీటికి రక్షణ ఉందా, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారా అని కేంద్ర హోంశాఖ పరిశీలించే వరకు మీకు జ్ఞానోదయం కలగదా? 1968లో నిర్మించిన వాటర్ ఫిల్టర్ హౌసెస్ ను ఆధునీకరించలేరా? కోట్లాది రూపాయలు దుబారా చేస్తున్నారు కానీ భక్తులకు నాణ్యమైన, శుభ్రమైన మంచినీరు అందించడానికి ఖర్చుపెట్టలేరా? టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.4వేల కోట్లు ఖర్చుపెడుతున్నారు. మరి భక్తులకు నాణ్యమైన నీరు అందించేందుకు రూ.4 కోట్లు ఖర్చుచేయలని స్థితిలో టీటీడీ ఉంది. జీతాలు తీసుకోవడం, వీఐపీల సేవలో తరించడం తప్పించి సామాన్య భక్తుల సమస్యలను, కష్టాలను గాలికి వదిలేస్తున్నారు. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధం పేరుతో మంచినీటి మాఫియా కొనసాగుతోంది. ఒక నీటి సీసా రూ.60 అమ్ముకుని భక్తుల రక్తం పీలుస్తున్నారు. అడిగే నాథుడెవ్వరు లేరు. హోటళ్లలో అధిక ధరలకు ఆహార పదార్థాలు విక్రయించి కనీసం తిరుమల కొండపై ఏ హోటల్ లోనూ ధరల పట్టిక కనిపించదు. హోటళ్లన్నీ వైసీపీ మాఫియా చేతుల్లో నడుస్తున్నాయి. నెలకు ఒక్కసారైనా ఆహార భద్రత అధికారులు, హెల్త్ ఆఫీసర్లు కానీ హోటళ్లను సందర్శించిన దాఖలాలు ఉన్నాయా? శాంపిళ్లు తీసుకుని ఏ రోజైనా పరీక్షశాలలకు పంపించి రిపోర్ట్ లు తెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయా? ఉంటే వాటిని బహిర్గతం చేయగలరా? టీటీడీ పాలకమండలి సభ్యులు టికెట్లు అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ధ భక్తుల సౌకర్యాల గురించి పట్టించుకున్న సందర్భాలు ఉన్నాయా? చివరకు పవిత్రమైన అన్నదానంలో కూడా భక్తులకు ఇచ్చేటువంటి మంచినీరు, అన్నప్రాసాదం నాణ్యతా ప్రమాణాలు లేవు. గతంలో అన్నదాన సత్రంలో నాసిరకం భోజనాల పెడుతున్నారని భక్తులు ఆందోళన వ్యక్తం చేసినా, వీడియోలు వైరల్ చేసినా మీకు బుద్ధి రాదా? మార్కెటింగ్ శాఖ అధికారులు నాణ్యత లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్లే అన్నదానంలో భోజనాలు, ప్రసాదాలు నాసిరకంగా ఉంటున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రంలో ఉన్న అద్దె గదులు దుర్గంధ భరితంగా ఉన్నాయి. సామాన్య భక్తులు ఉండేటువంటి అద్దె గదుల్లో కిటికీలు, బాత్రూం తలుపులు, ఫర్నిచర్ అన్నీ నాసిరకంగా ఉన్నాయి. వీఐపీ గదుల్లో మాత్రం స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ మాత్రానికే టీటీడీ ఈవోగా ఉన్న అర్హత లేని ధర్మారెడ్డికి ఎక్స్ టెన్షన్ లు, ఇంఛార్జ్ లు? ఇవన్నీ స్వామివారు చూస్తున్నారు. కొండపై జరుగుతున్న మీ దందాను ఏదో ఒక రోజు స్వామివారు తగిన విధంగా బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా టీటీడీ అధికారులు మేల్కొని భక్తులకు నాణ్యమైన మంచినీరు, ఆహారం అందించాలని, సామాన్యులు ఉండే గదుల్లో సౌకర్యాలు కల్పించాలని, పారిశుద్ధ్యాన్ని కాపాడాలని, హోటళ్ల దోపిడీని అరికట్టాలని, ప్రతి హోటల్ లోనూ ధరల పట్టిక ఏర్పాటుచేయాలి, అన్నదాత సత్రాల్లో నాణ్యమైన అన్నప్రాసాదం అందించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోందని సప్తగిరి ప్రసాద్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article