Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలుఆత్మహత్య అని ఎలా చెప్పారు?.. కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు

ఆత్మహత్య అని ఎలా చెప్పారు?.. కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు

కోల్‌కతాలో జరిగిన ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలి హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ముఖ్యంగా పలు అంశాలపై ప్రశ్నలు వేసింది.వైద్యురాలిపై హత్యాచారం జరిగిన వెంటనే పోస్టుమార్టం పూర్తి అయినప్పటికీ, ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు) చాలా ఆలస్యంగా నమోదైంది. ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి మధ్యాహ్నం 4 గంటలకు పోస్టుమార్టం పూర్తయిందని, ఎఫ్‌ఐఆర్ రాత్రి 11:45 గంటలకు నమోదైన నేపథ్యంలో పోలీసుల పని ఎందుకు ఆలస్యమైందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.మృతదేహం ఆత్మహత్యగా చెప్పడానికి కారణం ఏమిటో వైద్య సిబ్బందిని నిలదీసింది. ఆసుపత్రి సిబ్బంది, మృతదేహం అందులో పడి ఉన్న సమయంలో ఆత్మహత్యనే ఎందుకు భావించారని ప్రశ్నించింది.బాధితుడి పేరు, ఫొటోలను కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బాధితురాలి గోప్యతను ఉల్లంఘించే చర్యగా భావించబడింది.కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసులో ప్రిన్సిపాల్ ప్రవర్తనపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఆయనను మరో కాలేజీకి బదిలీ చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ పరిస్థిలో బదిలీ చేయడం అనేది ప్రభుత్వానికి సరైన నిర్ణయమా అని ప్రశ్నించింది.ఈ కేసులో, సుప్రీం కోర్టు కోల్‌కతా ప్రభుత్వం, పోలీసుల మరియు ఆసుపత్రి సిబ్బందిపై తీవ్రంగా స్పందించి, ఈ ఘటనకు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో పారదర్శకత, బాధ్యతపై సవాలు వేయడాన్ని ఉద్దేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article