Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుశ్రీవారి లడ్డూ వివాదం.. నెయ్యి కల్తీ కాలేదు.. ఆవు కల్తీ అయింది.. : తమ్మినేని సీతారాం

శ్రీవారి లడ్డూ వివాదం.. నెయ్యి కల్తీ కాలేదు.. ఆవు కల్తీ అయింది.. : తమ్మినేని సీతారాం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం గురించిన వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో వైకాపా సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు మరింత దృష్టి ఆకర్షించాయి. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలను ఖండిస్తూ, తమ్మినేని అన్నారు, “లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ కాలేదని, ఆవే కల్తీ అయ్యిందని” వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తమ్మినేని సీతారాం తన వ్యాఖ్యల్లో, ఆవులు పోషకాహార లోపంతో ఉండటం వలన వాటి పాలతో చేసిన నెయ్యి ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెప్పారు. “పామాయిల్ వంటి పదార్థాలను తీసుకునే ఆవుల పాలతో తయారైన నెయ్యి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని, ఇదే నెయ్యి లడ్డూ తయారీలో వాడారన్న ఆరోపణలపై వాస్తవాలను తెలుసుకోవాలని” ఆయన సూచించారు.తిరుమల లడ్డూ ప్రసాదం వంటి పవిత్రమైన అంశాలను రాజకీయ విమర్శలకు వాడడం హిందువుల మనోభావాలను దెబ్బతీయవచ్చని తమ్మినేని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article