Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలుకల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 725 కోట్ల నిధులు విడుదల

కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 725 కోట్ల నిధులు విడుదల

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా నవ దంపతులకు ప్రభుత్వం ఇస్తున్న రూ. 1,00,116కు తులం బంగారం జోడించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకంలో రూ. 5 లక్షలుగా ఉన్న పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం.. తాజాగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.2024-25 బడ్జెట్‌లో ఇందుకోసం కేటాయించిన రూ.725 కోట్ల నిధుల విడుదలకు అనుమతి లభించింది. ఈమేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. వివాహ బంధంతో ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్న పేద జంటలు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article