Sunday, January 12, 2025

Creating liberating content

బిజినెస్ఫలితాల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఫలితాల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

లోక్ సభ ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2 వేల పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 846 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. నేడు ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కొనసాగుతున్నా నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:36 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 2,134 పాయింట్లు క్షీణించి 74,334 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 846 పాయింట్లు క్షీణించి 22,417 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article