Wednesday, September 10, 2025

Creating liberating content

తాజా వార్తలుపవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత వాకధాన్ ర్యాలీ

పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత వాకధాన్ ర్యాలీ

గండేపల్లి:సూరంపాలెంలో గల పవర్ గ్రిడ్ ఆధ్వర్యంలో “స్వచ్ఛత హి సేవ” కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వాకధాన్ ర్యాలీ నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ముందుగా గాంధీ మహాత్మానికి ఉద్యోగులందరూ పూలతో నివాళులర్పించారు. తదుపరి పవర్ గ్రిడ్ గేట్ నుండి రామేశంపేట జంక్షన్ వరకు ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందితో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వాకదాన్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో డీజీఎం పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని, మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలని, ఇది సమాజ శ్రేయస్సుకి తోడ్పడుతుందని తెలిపారు. ర్యాలీకి ముందుగా రహదారికి ఇరువైపులా శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్లు కోటేశ్వరరావు, ఎ ఎస్ ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article