Sunday, November 16, 2025

Creating liberating content

తాజా వార్తలుపేకాట స్థావరం పై పోలీసులు రైడ్ .. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..

పేకాట స్థావరం పై పోలీసులు రైడ్ .. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్..

జగ్గంపేట :కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలోని శెట్టిబలిజ కాలనీ శివారు పంట పొలాలలో రహస్యంగా ఆడుతున్న పేకాట శిబిరంపై ఆదివారం జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు తన సిబ్బందితో దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ముగ్గురు పేకాట రాయులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ₹ 5వేల 200 రూపాయల నగదును, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రఘునాధరావు తెలిపారు. వీరిని రేపు ఉదయం కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. జగ్గంపేట మండల పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article