Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుదేశ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

దేశ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి బీజేపీకి మాత్రమే ఉంది : కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

హైదరాబాద్:కొమురం బీమ్ క్లస్టర్ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలనలో అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం ఎక్కడా లేదని విమర్శించారు. ఇక్కడ సాగు అవుతోన్న పసుపు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోందన్నారు. దేశంలో రూ.2 లక్షల కోట్లతో రోడ్లను ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. రవాణా సౌకర్యాలు మెరుగుపడితేనే వ్యాపార, వాణిజ్య రంగాలు పర్యాటకరంగ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. రోడ్లు, తాగు నీరు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు.రోడ్ల నిర్మాణాల కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అందుబాటులోకి తెచ్చామన్నారు. విమానాలకు ఇంధనం అందించే సామర్థ్యం మన రైతుల్లో ఉందని చెప్పారు. రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి వారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.దేశ ముఖ చిత్రాన్ని మార్చే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులు అందుబాటులో లేక అనేక గ్రామాలు ఖాళీ అయ్యాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article