Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలునేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు!

నేపాల్‌లో నదిలోకి దూసుకెళ్లిన 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు!

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పోఖరా నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో పలువురు గల్లంతైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article