ఎంపీడీవో సరళ కుమారి
కామవరపుకోట :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఈ నెల 25 పీజీ ఆర్ఎస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్తు అభివృద్ధి అధికారిని ఎం సరళ కుమారి ప్రకటనలో తెలిపారు. కామవరపుకోట చెక్పోస్ట్ వద్ద ఉన్న శ్రీ చిన్నది రాజప్ప ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉదయం 9:00 నుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఒక ప్రకటనలో కోరారు.